
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 354 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్ మరియుగ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 141, విద్యుత్శాఖ కు సంబంధించి 71, రెవెన్యూపరమైన సమస్యలకు సంబంధించి 42, ఇతర శాఖలకు సంబంధించి 100 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి డి. దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కువచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.